UPDATES  

 తాతా నిఖిల్ కు నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతారావు

మన్యం న్యూస్,ఖమ్మం ప్రతినిధి:
బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ అద్యక్షుడు ,ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సోదరుడు తాతా విశ్వేశ్వరరావు, నాగమణి దంపతుల కుమారుడు తాతా నిఖిల్ మృతి చెందారు. ఈ నేపథ్యంలో
తిరుమలయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలోని వారి నివాసమునకు వెళ్లి వారి కుటుంబాన్ని ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు గారు పరామర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాంతారావు వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అనంతరం నిఖిల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
వారితో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు బూర్గంపాడు జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత,మణుగూరు జెడ్పీటీసీ పొశం నర్సింహారావు, బీఆరెస్ నాయకులు ముత్యం బాబు,అడపా అప్పారావు,బొలిశెట్టి నవీన్, రామ కొండారెడ్డి, వంశీ కృష్ణ, యాంపాటి సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !