UPDATES  

 నేస్తమా ఇక సెలవు..ఏబీఎన్ రాజకుమార్ భౌతిక కాయాన్ని సందర్శించిన ప్రభుత్వ విప్ రేగా

  • నేస్తమా ఇక సెలవు..
  • ఏబీఎన్ రాజకుమార్ భౌతిక కాయాన్ని సందర్శించిన ప్రభుత్వ విప్ రేగా
  • గుండె పగిలిన గుండె పూడి
  • శోకసంద్రమైన జనం
  • ఏబీఎన్ రాజకుమార్ కు ఘన నివాళులు

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 24… పత్రిక రంగంలో ఎనలేని సేవ చేస్తూ అందరికీ సుపరిచితుడుగా పరిచయమై నేడు అందనంత దూరానికి వెళ్లిన ఏబీఎన్ రాజ్ కుమార్ భౌతికంగా మన మధ్య లేకున్నా ప్రతి ఒక్క హృదయంలో చిరస్థాయిగా ముద్ర వేసుకున్నారని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టం చేశారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం, గుండెపుడి గ్రామానికి చెందిన ఏబీఎన్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించిన వార్త తెలుసుకున్న ప్రభుత్వ విప్ రేగా కాంతారావు హుటా హుటిన గుండెపుడి గ్రామానికి చేరుకొని రాజ్ కుమార్ భౌతిక కాయాన్ని సందర్శించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్రికా రంగంలో అంచలంచలగా ఎదుగుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సమస్యలను వెలికి తీయడంలో ఏబీఎన్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్గా రాజకుమార్ అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు. గుండెపోటుతో అకాల మరణం పొందడం జీర్ణించుకోలేని విషయం అన్నారు. ఆయన మృతి పతికారంగానికి తీరనిలోటని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగడ సంతాపం వ్యక్తం చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !