మన్యం న్యూస్, అన్నపురెడ్డిపల్లి జనవరి 24 : మండల కేంద్రములోని కస్తూర్బా గాంధీ బాలికల విశ్వ విద్యాలయంలో సోమవారం బాలికల దినోత్సావన్ని పురస్కరించుకొని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్ధులకు కరాటే శిక్షణా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీపీ సున్నం లలిత హాజరయ్యారు.అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీపీ మట్లాడుతూ బాలికలు అన్ని రంగాలలో ముందుకు ఎదగాలని దానికి ప్రధానంగా విద్య అని విద్యతో పాటు అన్ని అన్ని రంగాలలో నైపుణ్యన్ని కలిగి వుండాలని ఆమె చెప్పారు.సమాజంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి స్త్రీలకు ఈ శిక్షణ ఎంతో ప్రాముఖ్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ భారత లావణ్య, ఎస్ ఎమ్ సి చైర్మన్ చిన్నలక్ష్మీ,స్థానిక సర్పంచ్ బొడా పద్మ, ఐసిడిఎస్ సూపర్వైజర్ అరుణ తదితరులు పాల్గొన్నారు.
