- రూ.2లక్షల50వేల ఎల్ ఓ సి అందజేత
- అనారోగ్యం బారిన పడి సీఎం సహాయ నిధి నుండి ఆర్థిక సాయం
- ఎమ్మెల్యే రేగా కాంతారావు మేలు మరువబోము
మన్యం న్యూస్ గుండాల: అభాగ్యుల పాలిట ఆరాధ్య దైవంగా ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు నిలుస్తున్నారు. సోమవారం మండల పరిధి దామరతోగు గ్రామానికి చెందిన సుతారి సందీప్ అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక పరిస్థితి సరిగా లేక హాస్పటల్ కు వెళ్లలేని నిస్సాయ స్థితిలో ఉన్నారు. అదే గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేత ,సర్పంచ్ భర్త సుతారి సత్యం ఇటీవలే సందీప్ ఆరోగ్య పరిస్థితి విషయమై పినపాక ఎమ్మెల్యే రేగా రేగా దగ్గరకు తీసుకువెళ్లి వివరించడం జరిగింది. చలించిన ఎమ్మెల్యే రేగా కాంతారావు తక్షణమే ఆరోగ్య ఖర్చులకోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ.2లక్షల 50వేల ఎల్ఓసి తక్షణమే మంజూరు చేయించారు. ఇప్పటికే మండలం పరిధిలోని నరసాపురం గ్రామానికి చెందిన దుర్గి సుధాకర్ బ్రెయిన్ సంబంధిత సమస్యతో బాధపడుతుంటే యువజన విభాగం నాయకులు ప్రభుత్వ విప్ రేగా దృష్టికి తీసుకువెళ్లి రూ 2 లక్షల 50 వేల రూపాయల ఎల్ ఓ సి మంజూరు చేయించి ప్రాణదాత అయ్యారు . ఉమ్మడి గుండాల మండలంలో ఇప్పటికే వందలాది సంఖ్యలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయాన్ని అందించి పేద ప్రజల పాలిట ప్రాణదాతగా నిలుస్తున్న రేగా కాంతారావు మేలు మరువబోమంటూ ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.