UPDATES  

 తుతుమంత్రంగా చర్యలు తీసుకొనే రెవెన్యూ పాత పద్ధతి మానుకోవాలి. :  ప్రజా పంథా పార్టీ మండల కార్యదర్శి కొండ చరణ్

మన్యం న్యూస్ చర్ల ,జనవరి 24:
మండలం గత కొంతకాలంగా  అనుమతులు లేకుండా విచ్చాలవిడిగా అక్రమంగా ఇసుక, గ్రావెల్ మట్టి తవ్వకాలు తొలకాలు జరుగుతున్నాయని,తుతుమంత్రంగా చర్యలు తీసుకొనే రెవెన్యూ శాఖ పాత పద్ధతి మానుకోవాలి అని సీపీఐ ఎంఎల్ ప్రజా పంథా పార్టీ మండల కార్యదర్శి కొండ చరణ్ అన్నారు. మండలం లో అధిక శాతం ట్రాక్టర్ డ్రైవర్లకి డ్రైవింగ్ లైసెన్స్ లేవు ,మైనర్లు కూడా ట్రాక్టర్ లు నడుపుతున్నారని, వారికి జరగకూడదు ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. రైతువారి గా నడపవలసిన ట్రాక్టర్ లను కామర్శియల్ ట్రాక్టర్ మాదిరిగా నడుపుతున్నారు ప్రశ్నించిన ప్రజలను ఈ అక్రమార్కులు బెదిరింపులు కు గురించేస్తున్నారనీ కొండా చరణ్ ఆరోపించారు. ఈ అక్రమ రవాణాని కట్టడి చెయ్యాలని ఎన్నో సార్లు ప్రజాపంధ పార్టీగా స్థానికి రెవెన్యూ అధికారులకు మోరపెట్టుకున్నామని అన్నారు. చట్టానికి తూట్లు పొడిచి అక్రమార్కులు వారి హవా నడుపుకుంటున్నారని అధికారులకు తెలియజేశామని అన్నారు. అందులో భాగంగానే ఈ రోజు రెవెన్యూ వారు స్పందించి అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరుపుతున్న 2 జేసీబీ లను 8 ట్రాక్టర్ లను పట్టుకున్నారని అన్నారు స్పందించిన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. మండలం లో అక్రమ గ్రావెల్ ,ఇసుక, మట్టితోలకాలు జరిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు .

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !