మన్యం న్యూస్ దుమ్ముగూడెం :
బిఆర్ఎస్ పార్టీ జాతీయ నాయకులు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర జన్మదిన వేడుకలను మండలం లోనిలక్ష్మీనగరం పార్టీ కార్యాలయంలో నాయకులు కేక్ కట్ చేసి మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధానకార్యదర్శి కణితి రాముడు, ఉపాధ్యక్షుడు కామేష్, అధికార ప్రతినిధి ఎండి జానీపాషా,సర్పంచ్ మట్ట వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ తిరుపతిరావు, రంజిత్, కెల్లా శేఖర్, దామెర్ల శ్రీనివాసరావు, గోసంగి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.