మన్యం న్యూస్ : జూలూరుపాడు, జనవరి 24, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కొత్తగూడెం సీనియర్ జర్నలిస్ట్ (ఏబీఎన్ రాజు) గుండెపోటుతో మరణించిన విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీప్ విప్, భద్రాద్రి జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మంగళవారం రాజు స్వగ్రామమైన గుండెపుడి లోనీ నివాసంలో రాజు పార్దివ దేహాన్ని సందర్శించి పూలమాల లేసి నివాళులర్పించారు. శోకసంద్రంలో ఉన్నవారి కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాజు ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. రాజు మరణ వార్త నన్ను బాధించిందని తెలిపారు. సీనియర్ జర్నలిస్టుగా అనేక ప్రజా సమస్యలపై అనునిత్యం అధికారులకు, ప్రజా ప్రతినిధులకు చేరవేస్తూ, ప్రజలను చైతన్య పరుస్తూ, మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి నీ కోల్పోవడం బాధాకరమన్నారు.