మన్యం న్యూస్,మణుగూరు, జనవరి 24: నిరుపేద కుటుంబానికిమండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు బియ్యాన్ని వితరణగా అందజేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని శివలింగాపురంలో ఇటీవల అకాల మరణం చెందిన నిరుపేద వ్యక్తి రెంటాల సురేష్ కుటుంబానికి పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు మణుగూరు పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అడప అప్పారావు నేతృత్వంలో యువజన నాయకులు మంగళవారం 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పినపాక నియోజకవర్గ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బోశెట్టి రవి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బానోతు రమేష్, మణుగూరు పట్టణ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి గుర్రం సృజన్, సోషల్ మీడియా అధ్యక్షులు మారోజు రమేష్, యువజన నాయకులు చిలకాని రామకృష్ణ, తాళ్లపల్లి నాగరాజు, శివ తదితరులు పాల్గొన్నారు.
