UPDATES  

 ఏ సి డి విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలి.. మర్మం చంద్రయ్య

 

మన్యం న్యూస్ దుమ్ముగూడెం ::
సామాన్య ,మధ్యతరగతి కుటుంబాల8 భారమవుతున్న ఏ సి డి విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మర్మం చంద్రయ్య డిమాండ్ చేశారు. మండలంలోని ములకపాడు ఎలమంచి సీతారామయ్య భవనంలో మంగళవారం జరిగిన వ్యవసాయ కార్మిక మండల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ… విద్యుత్ వినోదారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా సామాన్య ప్రజలకు అధిక భారం మోపుతున్న ఏసీబీ చార్జీలను వెంటనే తగ్గించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని లేకుంటే విద్యుత్తు చార్జీల పెంపుపై ఆందోళన కార్యక్రమంనిర్వహిస్తామని హెచ్చరించారు. ఇప్పటికే రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర సరుకులు పెరుగుదలతో సామాన్య ప్రజలు అవస్థలు పడుతుంటే, విద్యుత్ చార్జీల పెంపుతో తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు సోయం వీర్రాజు, జిల్లా కమిటీ సభ్యురాలు రాజేశ్వరి, అపక రంగయ్య, గట్టుపల్లి వెంకటేశ్వర్లు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !