UPDATES  

 భద్రాచలంలో 58 కిలోల గంజాయి పట్టివేత

 

మన్యం న్యూస్, భద్రాచలం :

భద్రాచలం పట్టణంలో 58 కిలోల గంజాయి తరలిస్తుండగా సోమవారం పోలీసులు పట్టుకున్నారు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… సోమవారం ఉదయం ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద ఎస్ఐ మధు ప్రసాద్ తన సిబ్బందితో వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో ఒక ఆటో, మోటార్ సైకిల్ పై 58 కిలోల గంజాయి సారపాక వైపుగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులు టేకులపల్లి మండలం, మూడు తండా గ్రామానికి చెందిన కనగల సుమన్, టేకులపల్లి మండలం, సింగ్య తండాకు చెందిన భూక్య సిద్దు లు అని పోలీసులు వెల్లడించారు. ఈ విషయంపై భద్రాచలం టౌన్ సిఐ నాగరాజు కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను రిమాండ్ తరలించారు. పట్టుబడిన గంజాయిని ఇంద్ర అనే వ్యక్తి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన కలిమెల నుండి కొనుగోలు చేసినట్లుగా సమాచారం తెలియవస్తుందని పోలీసులు వెల్లడించారు. నల్గొండ జిల్లా జలమలకుంట తండాకు చెందిన లావూరి సంతోష్ అనే వ్యక్తికి అమ్మడానికి తీసుకెళ్తుండగా భద్రాచలం పోలీసులకు పట్టుబడ్డారు. ఇద్దరు నిందితులు పరారీలో పరారీలో ఉన్నట్లు సమాచారం.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !