మన్యం న్యూస్, బూర్గంపాడు (జనవరి 22) : మండలంలోని మోరంపల్లి బంజర్ కు చెందిన సోము ఆదిరెడ్డి, ప్రదీప్ చారి అనారోగ్యం తో బాధపడుతున్నారని తెలిసి వారి ఇంటికి వెళ్లి జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత సోమవారం పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ఖగేందర్రెడ్డి, ఉపసర్పంచ్ కైపు లక్ష్మీనారాయణ రెడ్డి, వార్డ్ మెంబర్ కామిరెడ్డి పద్మ, టిఆర్ఎస్ నాయకులు పేరం రామిరెడ్డి, బత్తుల రామ కొండ రెడ్డి, కైపు బాలనాగిరెడ్డి, బాల నారాయణ రెడ్డి, గంగుల చంద్రశేఖర్ రెడ్డి, బిజ్జం వెంకటరామిరెడ్డి, కైపు అంకిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.