మన్యం న్యూస్ దుమ్ముగూడెం ::
పేదల పాలిట వరం సీఎం సహాయనిధి , తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల వైద్య ఖర్చులకోసం సీఎం సహాయ నిధి సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని దుమ్ముగూడెం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అన్నే సత్యనారాయణమూర్తి అన్నారు. మండలంలోని పెద్ద కమలాపురం గ్రామానికి చెందిన గొంది పార్వతి 51,000 కాటాయిగూడెం గ్రామానికి చెందిన కొరస భీమయ్య 60,000 రూపాయల లబ్ధిదారులకు లక్ష్మీ నగరం పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగ కాంతారావు సిఫార్సు ద్వారా విడుదలైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి కనితి రాముడు, అధికార ప్రతినిధి ఎండి జానీ పాషా, పార్టీ ఉపాధ్యక్షులు తునికి కామేష్, ఎంపీటీసీలు తిరుపతిరావు, రామారావు, భీమరాజు, సోషల్ మీడియా అధ్యక్షులు శ్రీనివాసరావు, పార్టీ నాయకులు గంగరాజు, వీరభద్రం, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.