మన్యం న్యూస్, భద్రాచలం , జనవరి 25
క్రీడలు మానసిక ధైర్యాన్ని, శరీర దృఢత్వాన్ని పెంపొందిస్తాయని కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ మహమ్మద్ ఖాన్ అన్నారు. బుధవారం భద్రాచలం పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో క్రీడా పోటీలను కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ మహమ్మద్ ఖాన్ టాస్ వేయించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఆటపాటలతో పాటు చదువులోనూ రాణించాలని సూచించారు. క్రీడలు మానసిక ధైర్యాన్ని, శరీర దృఢత్వాన్ని పెంపొందిస్తాయని అన్నారు. విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న పోటీల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి తమ కుటుంబానికి, గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి సైతం పేరు తెచ్చే విధంగా రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గం ఉపాధ్యక్షులు కోర్స ఆనంద్, పాఠశాల ప్రిన్సిపల్ రమేష్ గారు, పీఈటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.