UPDATES  

 ఆదివాసి చట్టాల రక్షణ కోసం ఐక్యంగా పోరాడాలి.. ఏఎస్పి డివిజన్ అధ్యక్షుడు మల్లుదొర

మన్యం న్యూస్ దుమ్ముగూడెం , జనవరి 25
ఏజెన్సీలోని ఆదివాసి అందరూ ఏజెన్సీ వాసుల అండగా ఉంటున్నటువంటి చట్టాలను కాపాడేందుకు ఐక్యంగా పోరాడాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ డివిజన్ అధ్యక్షుడు సోంది మల్లు దొర పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని చిన్న కమలాపురం గ్రామంలో రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఏజెన్సీలో గిరిజనేత్రులు ఏజెన్సీ వాసుల అండగా ఉంటున్నటువంటి చట్టాలను బద్నామ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఇకనుంచి మనం ఐక్యంగా ఉండి చట్టాల రక్షణ కొరకు పోరాటం చేయకపోతే రానున్న రోజుల్లో జాతి మునుగడకు ముప్పు ఏర్పడుతుందని అన్నారు. ఆదివాసి ప్రజానీకానికి చట్టాలను జాతిని కాపాడవలసిన బాధ్యత ఆదివాసీ బిడ్డలుగా మనకు ఉందన్నారు ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం పొందుపరిచిన జీవో నెంబర్ 3, 1/70 చట్టాలను పకల్బండిగా అమలు చేస్తూ వాటిని అమలు చేసే విధంగా పోరాడాలని పిలుపునిచ్చారు రానున్న రోజుల్లో ఆదివాసి అందరూ ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఐక్యంగా పోరాడి ఏజెన్సీ ప్రాంత హక్కుల కోసం ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సోయం వినోద్, మహేష్, చంటిదొర, ధర్మరాజు, వెంకట్, రామకృష్ణ, ప్రసాద్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !