UPDATES  

 మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మెచ్చా

 

మన్యంన్యూస్, అశ్వారావుపేట, జనవరి 25: మండల పరిధిలోని పలు కార్యక్రమాల్లో అశ్వరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు బుధవారం పాల్గొన్నారు. వినాయకపురం గ్రామంలో ఉప సర్పంచ్ జుజ్జురపు రాంబాబు మనవడి అన్నప్రాసన వేడుకలో స్థానిక నాయకులతో కలిసి పాల్గొని ఆశీర్వదించారు. అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ స్కూల్ లో ఓటర్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఓటర్ల అవగాహన సదస్సులో ఎంఎల్ఏ మెచ్చా పాల్గొని ప్రసంగించారు. అశ్వారావుపేట జడ్పీహెచ్ఎస్ లో నిర్మాణంలో ఉన్న మన ఊరు మన బడి నాణ్యత పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని సంబంధింత అధికారులను ఆదేశించారు. ఆదేవిదంగా ప్రభుత్వం తరుపున అందించే మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. కాకి నరసింహ రావు మేనల్లుడు వందనపు మురళి సాయి – రమ్య నైమిష వివాహ వేడుకకు హాజరై నవ దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, మండల నాయకులు, సర్పంచ్ లు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !