UPDATES  

 ప్రమాదంలో భారత రాజ్యాంగం… నేడు 74వ రిపబ్లిక్ డే వేడుకలు

1950జనవరి 26 న భారత చట్టానికి బదులు,భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ఆనాటి నుండి ప్రతి సంవత్సరం జనవరి 26 రిపబ్లిక్ డే జరుపుకోవడం జరుగుతుంది. నేడు భారతావని 74వ రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకోవడానికి సిద్ధమైంది.భారత రాజ్యాంగం ఆమోదం పొంది 73 సంవత్సరాలు ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. ప్రస్తుత దేశంలో నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే రాజకీయాలు భారత రాజ్యాంగాన్ని ప్రమాదంలోకి నెట్టేసాయ అని యావత్ దేశంతో పాటు ప్రపంచంలో జోరుగా చర్చ కొనసాగుతుంది. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంలో బి.ఆర్.ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించిన విషయం విధితమే. ఈ సభకు కేరళ, ఢిల్లీ పంజాబ్ ముఖ్యమంత్రులతోపాటు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సిపిఐ జాతీయ కార్యదర్శి హాజరయ్యారు. ఆయా పార్టీల ఎజెండా వేరే అయినప్పటికీ ముక్తకంఠంతో దేశంలో ప్రజాస్వామ్యం పై జరుగుతున్న దాడిని వారు ఖండించారు. భారత రాజ్యాంగంలో పొందపరిచిన ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకూడలు పోతుందని దుయ్యపడ్డారు. భారత్ ప్రజాస్వామ్య, సర్వసత్తాక,లౌకిక గణతంత్ర దేశంగా ఆవిర్భవించిన 74 సంవత్సరాల అనంతరం భారత రాజ్యాంగం పై పలు అనుమానాలు లేవనెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధ సంస్థలు కోర్టులు, ఈ డి, సి బి ఐ లను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని పలువురు మేధావులు బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు.
సిరా చుక్క దాడులు, అసహనం,ముకా దాడులు
భారతదేశం గణతంత్ర దేశంగా ఆవిర్భవించి 75 సంవత్సరాలు నేటికీ పూర్తయినప్పటికీ గత కొన్ని సంవత్సరాల నుండి యావత్ దేశంలో వింత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత నాలుగు సంవత్సరాల నుండి దేశంలోని నలుమూలలో పాలకుల వైఫల్యం పై గళం విప్పిన పలువురు మేధావులు, కవులు, రచయితలు, ప్రొఫెసర్ల పై సిరా చుక్కతో దాడులు జరిగాయి. అసహనం, మూక దాడులు అనే పదాలు అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో తరచుగా వినపడ్డాయి. దేశంలోఅసహనం అనేకమంది ప్రముఖులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు రాష్ట్రాలలో కులం పేరుతో మూకదారులు జరిగాయి.
ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన
కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని తుంగలో తొక్కి రాష్ట్రాలను తన చెప్పుచేతల్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నది. మతం, భాష, సంస్కృతి పేరుతో దేశంలోని బహుళ సంస్కృతులను ఒకే గాటన కట్టేసి ఏకరూపత సాధన అంటూ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న తమ పార్టీని ఎన్నుకుంటేనే పాలన సజావుగా సాగుతుందని ప్రజల్లోకి పంపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో భాజపాయేతర పాలన ఉన్న రాష్ట్రాలలో గవర్నర్ వ్యవస్థను ఉపయోగించి అక్కడ ముఖ్యమంత్రులపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. దీనితో ఆయా రాష్ట్రాలలో గవర్నర్లకు, ముఖ్యమంత్రిలకు మధ్యన విభేదాలు తారస్థాయికి వెళ్లాయి. ఒకరినొకరు గౌరవించుకునే స్థాయి నుండి విమర్శించే స్థాయి వరకు వెళ్లిందంటే దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇట్టే అవగతం అవుతుంది.
సాధారణ స్థితికి వచ్చేనా?
74 సంవత్సరాలు గణతంత్ర వేళ యావత్ దేశ ప్రజలు అనేక రకాల ఆందోళనకు గురవుతున్నారు. మూక దాడులు బుల్డోజర్ల దాడులతో, మతకల్లోలాలతో అతలాకుతలం అవుతున్నారు. భారత్ మాతాకీ జై అన్నట్లు యావత్ దేశం మొత్తం ఒకే పార్టీకి జై కొట్టాల అనే భావనలు సృష్టించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ పరిస్థితులు ఎప్పుడు చక్కబడునునని ప్రగతి భారతీయుని ఆలోచన.
వ్యాస కర్త
కొత్త దామోదర్ గౌడ్
సీనియర్ పాత్రికేయులు,
ఆర్ ఎం,మన్యం న్యూస్
9581905907

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !