UPDATES  

 అదైర్య పడకండి అండగా ఉంటా అశ్వాపురం పర్యటనలో పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ రేగా

మన్యం న్యూస్ అశ్వాపురం, జనవరి 25.. అదైర్య పడకండి అండగా ఉంటానని, పలువురు బాధిత కుటుంబాలకి ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు భరోసా ఇచ్చారు. బుధవారం అశ్వాపురం మండలం నెల్లిపాక గ్రామంలో లంక అప్పారావు గత కొన్ని రోజుల నుంచి పక్షవాతంతో బాధపడుతున్న వారిని అనారోగ్యంతో బాధపడుతున్న మల్లెలమడుగు గ్రామానికి చెందిన గొగ్గిళ్ళ గోవర్ధన చారినీ రామచంద్రపురం గ్రామపంచాయతీ శివలింగాపురం గ్రామానికి వాంకుడోత్ చిన్న భద్రు కి ఇటీవల కొన్ని రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తు కాలు విరగడం తో విషయం తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి బాధితుడిని పరామర్శించి యోగిక్షమాలు అడిగి తెలుసుకొని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా కల్పించినారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ కోడి అమరేందర్ , వైస్ ఎంపీపీ వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !