UPDATES  

 ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి…. – మణుగూరు తహసిల్దార్ నాగరాజు.

మన్యం న్యూస్,మణుగూరు, జనవరి 25: ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని మణుగూరు తహసిల్దార్ నాగరాజు అన్నారు. ఆయన బుధవారం మణుగూరు పట్టణంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్లో మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందాలన్నారు. ఓటు మనకున్న వజ్రాయుధమన్నారు.ఈ కార్యక్రమంలో మణుగూరు సీఐ ముత్యం రమేష్, ఎస్సై పురుషోత్తం, ఎంఈఓ వీరస్వామి, ఈఓఆర్ డి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !