మన్యం న్యూస్,మణుగూరు, జనవరి 25: ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని మణుగూరు తహసిల్దార్ నాగరాజు అన్నారు. ఆయన బుధవారం మణుగూరు పట్టణంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్లో మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందాలన్నారు. ఓటు మనకున్న వజ్రాయుధమన్నారు.ఈ కార్యక్రమంలో మణుగూరు సీఐ ముత్యం రమేష్, ఎస్సై పురుషోత్తం, ఎంఈఓ వీరస్వామి, ఈఓఆర్ డి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
