మన్యం న్యూస్ దుమ్ముగూడెం , జనవరి 25
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా తహసిల్దార్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గౌరవరం ఆశ్రమ పాఠశాలలో గ్రామస్తులకు, పిల్లలకు ఓటు యొక్క విలువ పై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని, ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. అనంతరం గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు ఓటరు దినోత్సవ సందర్భంగా పిల్లలకు పలు క్రీడా పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం మండల కేంద్రంలోని లక్ష్మి నగరం గ్రామంలో ఓటు హక్కు పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ ప్రతాప్, ఎంపీపీ రేసు లక్ష్మి, సర్పంచ్ జ్యోతి, మాజీ సర్పంచ్ మండల కార్యదర్శి కనితి రాముడు, రెవిన్యూ ఇన్స్పెక్టర్లు ఆదినారాయణ, లక్ష్మయ్య, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
