మందేస్తూ చిందేసిన వారిని మన్నించారు
– మాట వినని వారిని సస్పెండ్ చేస్తున్నారు..
– భద్రాచలం ఏటిడిఓపై చర్యలు తీసుకోవాలి : టిపిటిఎఫ్
మనం న్యూస్, భద్రాచలం , జనవరి 25
తాను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిని అని మరిచి మందేస్తూ చిందేస్తూ పాఠశాలకు వచ్చి తందనాల వాడిన వారిని సైతం భద్రాచలం ఏ టి డి ఓ పెద్ద మనసుతో క్షమించారని, మరి అంతకంటే పెద్ద తప్పు ఏం చేశామని ఎల్చిరెడ్డిపల్లి ఉపాధ్యాయురాలని సస్పెండ్ చేశారని టి పి టి ఎఫ్ నాయకులు ప్రశ్నించారు. బుధవారం నిర్వహించిన భద్రాచలంలోని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బి.రాజు, ప్రధాన కార్యదర్శి జి.హరిలాల్ లు పాల్గొని మాట్లాడుతూ… భద్రాచలం ఏ టి డి ఓ పక్షపాత విధానాల వల్లనే ఎల్చిరెడ్డిపల్లి ఏజీహెచ్ఎస్ పరిస్థితి దిగజారి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ వార్డెన్ వాళ్ళ అమ్మాయి చెవులు కుట్టించే ఫంక్షన్ లో ఉపాధ్యాయుల మధ్యాహ్న భోజనం చేసి ఆలస్యంగా రావడం కారణంగా చూపిస్తూ డిప్యూటీ వార్డెన్ భోజనాలు పెట్టినందుకు, హెచ్ఎం ఉపాధ్యాయులను పంపినందుకు ఇద్దరినీ సస్పెండ్ చేయించారని పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు కూడా బంధాలు, బంధుత్వాలు, ఆచార్య వ్యవహారాలు, సంప్రదాయాలు ఉంటాయని వాటిలో పాల్గొన్నందుకు ఉపాధ్యాయులు ఏదో పెద్ద నేరం చేసినట్టుగా వారిని సస్పెండ్ చేయడం కాదు సరికాదని అన్నారు. ఏ జి హెచ్ ఎస్ పెద్దమెడిసిలేరు లో ఒక ఉపాధ్యాయుని చదువుకోవడానికి సౌకర్యం లేకున్నా ప్రతినెల జీతభత్యాలు తీసుకునేలా ఎందుకు ఆదేశించారని ప్రశ్నించారు. భద్రాచలం ఏ హెచ్ ఎస్ లో ‘ టీచర్లకు చేపల పులుసు.. పిల్లలకు పప్పు.. ‘ అనే శీర్షికతో ఓ పత్రికలో కథనం వెలువడినప్పటికీ ఏ టి డి ఓ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పాల్వంచ ఏ హెచ్ ఎస్ లో విద్యార్థులు తమకు సరైన మెనూ అందించడం లేదని రహదారిపై కూర్చొన నిరసన తెలుపుతుంటే అక్కడి పరిస్థితులు భద్రాచలం ఏటీడీఓకి కనబడలేదా అని విమర్శించారు. పడమటి నరసాపురం ఏజిహెచ్ఎస్ లో 70 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురైనప్పటికీ అక్కడ ఎటువంటి చర్యలు ఏటీడీఓ ఎందుకు తీసుకోలేదని ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయ సంఘం నాయకులు ఉన్నారనే వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఏ జి హెచ్ ఎస్ ఇల్లందు ఓల్డ్ లో ఉపాధ్యాయులు మేకను కోసుకొని పార్టీలు చేసుకుని, మందేసి చిందేసిన టీచర్ పై సైతం చర్యలు తీసుకోకపోవడం ఎటువంటి సంకేతాలకు అద్దం పడుతున్నాయని వారు ప్రశ్నించారు. ఏ టి డి ఓ తనని తాను కాపాడుకునేందుకు కొందరు గిరిజన ఉపాధ్యాయులను తన చెప్పు చేతల్లో పెట్టుకొని తనకు అనుకూలంగా ఐటీడీఏ పీవో కి చెప్పించాలని చూస్తున్నారని ఆరోపించారు. పై ఉదాహరణలకంటే ఎల్చిరెడ్డిపల్లి హెచ్ఎం, డిప్యూటీ వార్డెన్ లు పెద్ద తప్పు ఏం చేశారని ఎందుకు వారిపై తీసుకొని చర్యలు, వీరిపై ఎలా తీసుకున్నారు అని ప్రశ్నించారు. అందరూ గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయులే అని అందరికీ ఒకే విధమైన చర్యలు తీసుకోవాలని టి పి టి ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం శాఖ సభ్యులు డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. భద్రాచలం ఏటీడీఓ వారి విచారణ నివేదిక వలన ఎల్చిరెడ్డిపల్లి హెచ్ఎం, డిప్యూటీ వార్డెన్ సస్పెండ్ అయ్యారని వారిపై చర్యలు తీసుకోవాలని టి పి టి ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం తరపున డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టి పి టి ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాఖ సభ్యులు టి.సత్తిబాబు, బి.ప్రకాష్ రావు, ఎం.రామాచారి తదితరులు పాల్గొన్నారు.