మన్యం న్యూస్ గుండాల, జనవరి 26… ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చొరవతో వంతెన పనులు మేకవంతమయ్యాయి. గుండాల, ఆళ్లపల్లి మండలాలను కలిపి రహదారి మధ్యలో కిన్నెరసాని వాగు ప్రవహిస్తూ ఉంటుంది ఈ వాగును దాటాలంటే కచ్చితంగా వంతెన కావాల్సిందే ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే నిధులను మంజూరు చేయించారు కానీ గుత్తేదారు అలసత్వానికి ఏళ్లు గడుస్తున్న పనులు మాత్రం ముందుకు సాగలేదు. వంతెన పనులపై దృష్టి సారించిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అధికారులతో మాట్లాడి వంతెన పనులను వేగం పెంచాలని ఆదేశించడంతో పనులు ఊపందుకున్నాయి. ఈ వంతెన పూర్తి అయితే గుండాల నుండి ఆళ్లపల్లి, కొత్తగూడెం వెళ్లడానికి గుండాల మండల వాసులకు చాలావరకు కిలోమీటర్లు తగ్గటంతో పాటు సమయం కూడా ఆదా
