మన్యం న్యూస్ గుండాల జనవరి 26: అనధి కాలంలోనే పాటకులకు మన్యం న్యూస్ చేరువైందని ఆళ్లపల్లి జెడ్పిటిసి హనుమంతరావు, ఎంపీపీ మంజు భార్గవి అన్నారు. గురువారం మన్యం న్యూస్ 2023 క్యాలెండర్ ను ఆళ్లపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆలోచిస్తాత్మకమైన కథనాలను పాఠకులకు అందిస్తున్న మన్యం న్యూస్ మునుముందు దూసుకుపోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రేస్ ఎల్లయ్య, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ బాబా, పార్టీ నాయకులు ఖయ్యూం, ఓకే కిషోర్ బాబు, గుండాల మండల బీసీ సెల్ అధ్యక్షులు గడ్డం రమేష్ , ఆళ్లపల్లి పార్టీ నాయకులు నవీన్ తదితరులు పాల్గొన్నారు
