మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి జనవరి 26 : మండలం పరిధిలోని పెద్దిరెడ్డిగూడెం పంచాయతీ పరిధిలో శాంతినగర్ గ్రామానికి సీసీ రోడ్ల నిర్మాణం కోసం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు నిధుల నుంచి రూ. 5 లక్షల రూపాయలు ఎంపీపీ నిధుల రూ.5 లక్షల రూపాయలతో అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరరావు కృషితో శాంతినగర్ లో సుమారు రూ.10 లక్షల రూపాయల వ్యాయంతో సి సి రోడ్లు నిర్మాణానికి ఎంపీపీ సున్నం లలిత గురువారం కొబ్బరి కాయ కోట్టి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు l పిఎసిఎస్ చైర్మన్ బోయినపల్లి సుధాకర్ రావు,వైస్ ఎంపీపీ మామిళ్ళపల్లి రామారావు,ఎంపీటీసీ సభ్యురాలు కాక సీతామహాలక్ష్మి,సర్పంచ్ నున్న బసవయ్య,టిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.