మన్యం న్యూస్, దమ్మపేట, జనవరి 26.. దమ్మపేట పిహెచ్సీ మల్కారంలో సబ్ సెంటర్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఏఎన్ఎం గా విధులు నిర్వహిస్తున్న అంకంపాలెం గ్రామానికి చెందిన ఆదివాసి మహిళ కుర్సం సరస్వతి ఉత్తమ ఏఎన్ఎంగా అవార్డును గురువారం అందుకున్నారు. 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కేంద్రంలో ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, జిల్లా కలెక్టర్ అనుదీప్ చేతుల మీదుగా గురువారం ఏఎన్ఎం కుర్సం సరస్వతి కి అవార్డును అందించారు. మెరుగైన సేవలు అందించినందుకు గాను ఈ అవార్డు ఆమెకు వరించింది.