మన్యం న్యూస్, అశ్వారావుపేట, జనవరి 26: కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వామపక్షాలు ఆద్వర్యంలో గురువారం ద్విచక్రవాహనం ర్యాలీ నిర్వహించారు. సిపిఐ(యం), సిపిఐ, ప్రజా పంథా నాయకులు కె పుల్లయ్య, గొకినపల్లి ప్రభాకర్, రామక్రిష్ణ నేతృత్వంలో స్థానిక మండల పరిషత్ పూర్వ కార్యాలయం నుండి భగత్ సింగ్, గాంధీ, పొట్టి శ్రీరాములు కూడల్లు మీదుగా ద్విచక్ర వాహనం ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలను విధానాలకు నిరసన నినాదాలు చేసారు. ఈ కార్యక్రమంలో నాయకులు అర్జున్, చిరంజీవి, మోరంపుడి శ్రీనివాసరావు, దొడ్డా లక్ష్మినారాయణ, రఫీ, వాసం బుచ్చిరాజు, తగరం జగన్నాదం, గడ్డం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.