UPDATES  

 ఘనంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు…

మన్యం న్యూస్ దుమ్ముగూడెం ::
మండల వ్యాప్తంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో చంద్రశేఖర్ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ రేసు లక్ష్మి ఎంపీడీవో చంద్రమౌళి ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేసి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్లో సీఐ దోమల రమేష్ జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. పాఠశాలలో కాలేజీలు ప్రభుత్వ కార్యాలయాలు గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించి పిల్లలకు మిఠాయిలను పంచిపెట్టారు. బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు అన్నే సత్యాలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు లంక శ్రీనివాసరావు జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. మండల వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు డాక్టర్ బాలాజీ నాయక్, పుల్లారెడ్డి, విద్యాశాఖ అధికారి సున్నం సమ్మయ్య, ప్రభాకర్ రావు, ఎస్సై రవికుమార్, సర్పంచులు తెల్లం వరలక్ష్మి, సోడి జ్యోతి, మడకం నాగేంద్రబాబు, పూజారి మోహన్ రావు, బిఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి కనితి రాముడు, ఉపాధ్యాయులు, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !