మన్యం న్యూస్, కరకగూడెం:గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు నిస్వార్ధంగా అందించిన సేవలకు గానుఉత్తమ ఎంపీడిఓగా శ్రీనువాస్ ఎంపికయ్యారు. గురువారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నూతన కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దురిశేట్టి అనుదీప్,ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చేతులమీదుగా ఉత్తమ అధికారి అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ తో మాట్లాడుతూ ఉత్తమ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని, తనపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. నాకు అవార్డు రావడానికి కృషిచేసిన వారందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
