మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 26… ఒక గిరిజన మహిళను దేశ ప్రథమ పౌరురాలుగా చేసుకున్న అతి గొప్ప భారత రాజ్యాంగం మనదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు. గురువారం 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణతంత్ర వేడుకలలో ఆయన ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎస్పీ డాక్టర్ వినీత్ మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల ఫలితమే నేడు దేశ ప్రజలంతా స్వేచ్ఛా వాయువులను ఆస్వాదిస్తూ 74వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని,కావున వారిని ఎప్పుడూ మనం స్మరించుకోవాలని,వారి త్యాగ ఫలం ద్వారా మనం ఈరోజు ఎంతో స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవిస్తున్నామని అన్నారు, అమరుల ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.ఒక గిరిజన మహిళను దేశ ప్రధమ పౌరురాలిగా చేసుకున్న అతి గొప్ప రాజ్యాంగం మనదని తెలియజేసారు.ప్రజలకు రాజ్యాంగం కల్పించిన చట్టం ప్రకారం పారదర్శకతతో ధనిక,పేద అనే తేడా లేకుండా విధులు నిర్వర్తించాలని,అందరినీ సమానంగా చూసి సమన్వయం అందించి ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సాధించాలని అధికారులకు,సిబ్బందికి తెలిపారు.జిల్లా పోలీస్ అధికారులు,సిబ్బంది అందరూ కూడ బాగా పని చేస్తున్నారని అభినందించారు.తెలంగాణ పోలీసులు దేశంలోనే అత్యంత ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్న పోలీసు వ్యవస్థగా మంచి గుర్తింపు సాధించడం జరిగిందని,దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ సాంకేతికతను అలవర్చుకోవాలని తెలిపారు. ప్రతి ఉద్యోగి బాధ్యతతో సక్రమంగా విధులు నిర్వర్తించి ప్రజల ఆదరాభిమానాలు పొందాలని సూచించారు.ప్రజలతో మమేకమై విధులు నిర్వర్తించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అక్షాంశ యాదవ్ ఐపిఎస్,కొత్తగూడెం డిఎస్పీ వెంకటేశ్వర బాబు,డీసీఆర్బీ డిఎస్పీ నందీరామ్,ఏఆర్ డిఎస్పీ విజయ్ బాబు,కార్యాలయ ఏవో వెంకటేశ్వర్లు,ఎస్బి ఇన్స్పెక్టర్ స్వామి, ఎస్బి,డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ ఉపేందర్ ,సిఐలు,ఆర్ఐలు,ఎస్సైలు,ఇతర పోలీస్ అధికారులు,ఐటీ సెల్ సిబ్బంది,కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
