UPDATES  

 కళ్యాణ లక్ష్మి ఆడబిడ్డలకు అండ ప్రభుత్వ విప్ రేగా

మన్యం న్యూస్ గుండాల: కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ పథకాలు మహోత్తరమైన పథకాలని,ఆడ బిడ్డలకు అండ అని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సోమవారం మండలంలో పర్యటించిన ఆయన మర్కోడు రైతు వేదికలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపడుచులకు అండగా నిలవాలనే దృఢ సంకల్పంతో కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకువచ్చారని ఆయన అన్నారు. పెళ్లి జరిగిన ప్రతి ఆడపడుచుకు లక్ష రూపాయల కానుకను అందించే రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒక తెలంగాణ రాష్ట్రమేనని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో జడ్పిటిసి హనుమంతరావు, ఎంపీపీ మంజు భార్గవి, తాసిల్దార్ సాదియా సుల్తానా, ఎంపీడీవో మంగమ్మ, సర్పంచ్ శంకర్ బాబు, పిఎసిఎస్ చైర్మన్ రామయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు, ప్రధాన కార్యదర్శి బాబా, ప్రజా ప్రతినిధులు, అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !