సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల జీవో నెంబర్ 22 గెజిట్ కై అసెంబ్లీ లో చర్చించండి
కార్మికులకు న్యాయం చేయండి:ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కు వినతి
మన్యం న్యూస్ మణుగూరు టౌన్, ఫిబ్రవరి 02
మణుగూరు సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్,వర్కర్స్ యూనియన్ ఐ ఎఫ్ టి యూ అధ్వర్యంలో కార్మికులు గురువారం నాడు మణుగూరు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వ విప్,రేగా కాంతారావు ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడూతూ,శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలలో షెడ్యూల్డ్ ఏరియా కాంటాక్ట్ కార్మికులకు సంబంధించిన జీవో నెంబర్ 22 ను గెజిట్ అయ్యేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి,సింగరేణి వ్యాప్తంగా కోల్ బెల్ట్ ప్రాంతాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వేతన పెంపు విషయంలో న్యాయం చేయాలని కోరుతూ విప్ రేగా కాంతారావు కు వినతి పత్రం అందజేశారు.అనంతరం కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఏ.మంగీలాల్ మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా షెడ్యూల్డ్ ఏరియాలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపుకు సంబంధించి ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 22 ను చేశారని,అట్టి జీవో గెజిట్ కాని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతాలలోని షెడ్యూల్డ్ ఏరియాలలో పనిచేస్తున్న అనేక మంది కాంటాక్ట్ కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు అని తెలిపారు.గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో జేఏసీ సమ్మె నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జీవో నెంబర్ 22 గెజిట్ చేయాలని వ్రాతపూర్వకంగా కోరారని ఆయన గుర్తు చేశారు. జీవో నెంబర్ 22 అమలు అయితే సింగరేణి వ్యాప్తంగా 18 వేల మందికి పైచిలుకు కాంట్రాక్ట్ కార్మికులకు లబ్ధి చేకూరనుందని ఆయన తెలిపారు.తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో జీవో నెంబర్ 22 గెజిట్ అయ్యేవిధంగా తగు చర్యలు చేపట్టాలని,ప్రభుత్వ విప్ రేగాను కోరారు.సమస్య పట్ల సానుకూలంగా స్పందించిన విప్ రేగా సమస్యను ముఖ్యమంత్రి దృష్టి కు తీసుకెళ్ళి తగు న్యాయం చేస్తానని వారికి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు గురుమూర్తి,రవికుమార్,వి శంకర్ నాయక్,వెంకటేశ్వర్లు, సాయికుమార్,టైసన్,వినయ్ కుమార్,శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు