UPDATES  

 మినీ జాతరలో గద్దెల వద్ద సమ్మక్కకు పూజలు.. తల్లులను దర్శించుకున్న బిఆర్ఎస్ బృందం..

 

మన్యం న్యూస్ దుమ్ముగూడెం ::
మారాయి గూడెం గ్రామంలో శ్రీ సమ్మక్క సారలమ్మ మినీ జాతరలో భాగంగా మూడవరోజు సమ్మక్కను గద్దెల వద్దకు తీసుకుని వచ్చారు. గిరిజనుల ఆరాధ్య దైవం మినీ మేడారం గా పిలుచుకునే మారాయిగూడెం గ్రామంలో సమ్మక్క సారలములను దర్శించుకునేందుకు ఏపీ చతిస్గడ్ తెలంగాణ రాష్ట్రాల నలుమూల నుండి భక్తులు తరలివచ్చి అమ్మవార్లను మొక్కుబడును చెల్లించుకున్నారు. గురువారం సమ్మక్క తల్లిని ఊరు చివర గుట్ట నుండి మేల తాళాలు డప్పు వాయిద్యాలు నడుమ దేవర గద్దెల వద్దకు తీసుకువచ్చారు. ఈరోజు శ్రీ సమ్మక్క సారలమ్మ చిన్న జాతర పెద్ద పండుగ సందర్భంగా గద్దెలపై ఇరువురు తల్లులు దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. మినీ మేడారం జాతర వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం పడకుండా జాతర కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ మినీ మేడారం జాతర సందర్శించి సమ్మక్క సారలమ్మను గద్దెలను దర్శించుకున్న దుమ్ముగూడెం మండల బిఆర్ఎస్ పార్టీ బృందం. ఈ కార్యక్రమంలో దేవర బాలలు సోడి శాంతమ్మ, అచ్చమ్మ, మారాయి గూడెం సర్పంచ్ తిరుపతిరావు, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సత్యాలు, కార్యదర్శి కనితిరాముడు, ఉపాధ్యక్షుడు తునికి కామేశ్వరరావు, సర్పంచ్ కల్లూరి అశ్విని, నాయకులు శ్రీనివాసరావు, రంజిత్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !