మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 02…. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను పొందాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ సూచించారు
. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయంలోని మిని సమావేశపు హాలులో ఆధార్ అప్డేట్ ప్రక్రియపై జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సేవలు సులభంగా పొందేందుకు ఆధార్ అప్డేట్ తప్పనిసరి అని చెప్పారు. ఆధార్ ఆధారంగా సేవలు కొనసాగుతున్నాయని సూచించారు. అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో రానున్న నెల రోజుల్లో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు. 0-6 సంవత్సరాలు ఉన్న చిన్నారులకు అంగన్ వాడి కేంద్రాల ద్వారా ఆధార్ కార్డు జనరేట్ చేయాలని అంగన్వాడి అధికారులను ఆదేశించారు. ఐడిఓసి కార్యాలయంలో ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయాలని డిఆర్ఓకి సూచించారు. ప్రతి 10 సంవత్సరాలకు ఓసారి ఆధార్ అప్డేట్ చేయాల్సి ఉన్నదని, తప్పనిసరిగా ప్రజలందరూ ఆధార్ అప్డేట్ చేపించుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఏ మండలం కూడా ఆధార్ కేంద్రం లేకుండా ఉండడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు. అత్యంత ప్రాధాన్యంతో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో 40 వేల మంది చిన్నారులకు ఆధార్ నమోదు చేసేందుకు అంగన్వాడి కేంద్రాల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సంక్షేమ అధికారికి సూచించారు. ఆధార్ బయోమెట్రిక్ పడని లబ్ధిదారులు రేషన్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని జిల్లా పౌర సరఫరాల అధికారి నుండి అట్టి జాబితా సేకరించి సమస్య పరిష్కారానికి రాష్ట్ర కార్యాలయానికి సిఫారసు చేయాలని చెప్పారు. ఆధార్ లేని విద్యార్థులు జిల్లాలో 1852 మంది ఉన్నారని వారి నమోదు కొరకు ప్రత్యేక డ్రైవర్ నిర్వహించాలని, ఎమ్మార్సీలకు లక్షాన్ని నిర్దేశించి విద్యార్థులకు ఆధార్ నమోదుకు చర్యలు చేపట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం సిబ్బంది ఆధార్ అప్డేట్ కొరకు చర్యలు చేపట్టాలని డిఆర్డిఓ కి సూచించారు. పుట్టిన వెంటనే బర్త్ రిజిస్ట్రేషన్ తో పాటు ఆదార్ జనరేట్ చేయాలని వైద్య, సంక్షేమ అధికారులకు సూచించారు. అనంతరం ఆధార్ కార్డు అప్డేట్ సూచించే విషయాలతో కూడిన గోడ పత్రికను ఆవిష్కరించారు ఈ సమావేశంలో డిఆర్డీఓ మధుసూదన్ రాజు, డిపిఓ రమాకాంత్, జడ్పి సీఈఓ విద్యాలత, జిల్లా వైద్యాధికారి డా శిరీష, సంక్షేమ అధికారి లేనీనా, డీఈఓ ప్రసాద్, డిఆర్వో అశోక్ చక్రవర్తి, అదనపు ఎస్పీ నందిరామ్, ఏవో గన్యా, పోస్టల్ పర్యవేక్షకులు
ఆర్ సంతోష్, ఈడీఎం విజయ సారధి, ప్రాజెక్ట్ మేనేజర్ అనిల్ రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ వినయ్, మీ సేవ జిల్లా మేనేజర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు
