UPDATES  

 తెలంగాణలో అడవులు ఉండడం కాదు పచ్చని అడవుల్లోనే తెలంగాణ ఉండాలి రాష్ట్ర పరిశీలకులు కిషన్ రావు

మన్యం న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 02..తెలంగాణలో అడవులుండటం కాదు.. అడవుల్లోనే తెలంగాణ ఉండాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు రాష్ట్ర
వ్యాప్తంగా పచ్చదనం పెంపకానికి చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర పరిశీలకులు కె. కిషన్ రావు తెలిపారు. గురువారం ఐడిఓసి కార్యాలయంలో గార్డెన్, లాన్, మొక్కలతో పాటు పచ్చదనాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 7వ గార్డెన్ అర్బన్ ఫార్మింగ్ ఫెస్టివల్ 2023 నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని ఐడిఓసి కార్యాలయాల్లో పచ్చదనం పెంపకానికి చేపట్టిన చర్యలను కె.వి ప్రవీణ్ కుమార్,
యూసఫలీ అధికారుల బృందం పరిశీలన చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఖమ్మం, మహబూబాబాద్, వనపర్తి, మహబూబ్ నగర్ ఐడిఓసి కార్యాలయాలలో పచ్చదనం పెంపకానికి చేపట్టిన చర్యలను పరిశీలించినట్లు ఆయన చెప్పారు.
ఫిబ్రవరి నెలాఖరులో రాష్ట్రస్థాయిలో నిర్వహించనున్న ఈ పోటీలకు ఐడిఓసిలలో పచ్చదనం పెంపకానికి చేపట్టిన చర్యలను ప్రామాణికంగా తీసుకుని రాష్ట్రస్థాయిలో ఎంపిక చేసిన ఉత్తమ ఐడిఓసి కార్యాలయాలకు ప్రధమ, ద్వితీయ,
తృతీయ బహుమతులను అందచేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సిబ్బంది విధులు నిర్వహణకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలంటే పచ్చనిచెట్లు ఉండాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పెద్దఎత్తున పచ్చదనం పెంపునకు
చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఐడిఓసి కార్యాలయాలతో పాటు వైద్య కళాశాలలు, యూనివర్శిటీలలో మొక్కలు
పెంపకాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. గతంలో ఉద్యానశాఖ ద్వారా కూరగాయలు, పండ్లు మాత్రమే సాగు చేసేవారని
నేడు ఉద్యానశాఖ ఆద్వర్యంలో అడవులు పెంపకానికి సైతం చర్యలు చేపట్టినట్లు చెప్పారు. గతంలో కొన్ని ప్రాంతాల్లోనే
లాం్యడ్ స్కేపింగ్ ఉండేదని, నేడు అన్ని ప్రాంతాల్లో ల్యాండ్ స్కేపింగ్ చేపట్టినట్లు చెప్పారు. ఇండ్లలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు టెర్రాస్ గార్డెన్ ఏర్పాటుకు పెద్దఎత్తున ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఐడిఓసి
కార్యాలయంలో పచ్చదనం పెంపొందించేందుకు జిల్లా కలెక్టర్ అనుదీప్ ఎంతో ప్రణాళికతో, పకడ్బందీ చర్యలు చేపట్టారని, అందువల్లే నేడు ఐడిఓసి కార్యాలయం పచ్చదనాన్ని సంతరించుకున్నదని అభినందించారు. మొక్కలు
పెరుగుతుంటే వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందని, తద్వారా చల్లదనం పెరుగుతుందని చెప్పారు. ఐడిఓసి కార్యాలయం పర్యాటక ప్రాంతంగా తయారవుతుందని చెప్పారు. భద్రాచలం వెళ్తుంటే పచ్చని చెట్లు, లాన్ ప్రజలకు
ఆకట్టుకుంటుందని చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పండ్ల మొక్కలు పెంపకాన్ని చేపట్టి ప్రతి ఇంటికి పండ్ల మొక్కలు పంపిణీ చేసేందుకు నర్సరీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
పాల్వంచ పట్టణ ఎస్పై విధులు నిర్వహిస్తున్న రామారావు ఆయిల్పామ్ పంట సాగు చేపట్టడం పట్ల పరిశీలకుల అధికారుల బృందం అభినందించారు. గురువారం ఐడిఓసి కార్యాలయంలో పచ్చదనం పరిశీలనకు వచ్చిన బృందానికి
రామారావు 11 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేస్తున్నట్లు జిల్లా ఉద్యాన అధికారి జినుగు మరియన్న వివరించారు.విధుల నిర్వహణలో ఎంతో బిజిగా ఉన్నప్పటికీ వ్యవసాయంపై మక్కువతో రామారావు ఆయిల్పామ్ సాగు చేయడం
పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మొక్కను బహుకరించి అభినందించారు. ఆయిల్పామ్ సాగుతో సంవత్సరానికి రూ.11 లక్షలఆదాయం సమకూరుతున్నదని, మరో 10 ఎకరాల్లో సాగు చేసేందుకు కార్యాచరణ చేస్తున్నట్లు రామారావు వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి జినుగు మరియన్న, ఉద్యానశాఖ సిబ్బంది కిరణ్ కుమార్, విజయ్ మార్త తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !