మన్యం న్యూస్ కరకగూడెం, ఫిబ్రవరి 03 ..ఆదివాసీ సంప్రదాయాలతో మూడు రోజులుగా అంగరంగ వైభవంగా నిర్వహించిన చిరుమల్ల సమ్మక్క సారలమ్మ జాతర చివరి అంకానికి చేరుకుంది. గురువారం రాత్రి పగిడిద్దరాజు సమ్మక్కలకు కళ్యాణ మహోత్సవం నిర్వహించిన ఆలయ పూజారులు శుక్రవారం ఉదయం తల్లికి మొక్కులు చెల్లించుటకు సిద్ధం చేశారు. ఉదయం నుంచి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మూడు రాష్ట్రాల నుంచి ఇలవేల్పులతో వచ్చిన భక్తులు భారీగా మొక్కలు చెల్లించుకున్నారు. ప్రజలు భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతూ దర్శనం ఇచ్చింది అనంతరం భక్తులు ఆలయ సముదాయంలో ఏర్పాటు చేసిన దుకాణాల వద్ద పిల్లలకు, ఆట వస్తువులు, యువకులు ఈలపిట్టలు బురాలు తిసుకోని వాటిని ఊదుతూ జాతరంతా కలయ తిరిగారు. ఇలవేల్పుల సమ్మేళనానికి వచ్చిన భక్తులు ఇలా వేల్పులు తమ సమూహాన్ని సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు వచ్చి తమ గట్ల వేల్పుల ముక్కులను చెల్లించారు. అనంతరం తిరుగు ప్రయాణంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని నీళ్లు ఆరబోస్తూ తమ భక్తుని సాటుకున్నారు.భారీ ఎత్తున తరలివచ్చిన ఇలా వేల్పులకు ఆదివాసీ కులపెద్దలకు తలపతులకు ఆలయ కమిటీ సభ్యులు కమిటీ అధ్యక్షులు చందా. లింగయ్య దొర,చందా.బిక్షపతి భూపతయ్య,పూజారులు, వీరయ్య, స్థానిక సర్పంచ్ పాయం. నరసింహారావు ఆలయ కమిటీ సభ్యులు జాతరను ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నామని,అలాగే జాతరలో ఎటువంటి వాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి సహాయ సహకారాలు అందించిన మణుగూరు డిఎస్పి,ఎడుళ్ల బయ్యారం సీఐ కరకగూడెం ఎస్ఐ వారి సిబ్బందికి అలాగే ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు శుభ్రపరచిన గ్రామపంచాయతీ సిబ్బంది మండల ప్రజా పరిషత్ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆలయ కమిటీ పెద్దలు సభ్యులు తెలిపారు.
