మన్యం న్యూస్ ఇల్లందు ఫిబ్రవరి3:- ఒరిస్సా నుంచి మహారాష్ట్ర తరలిస్తున్న గంజాయిని ఇల్లందు పోలీసులు శుక్రవారం రోజు పట్టుకున్నారు.భద్రాచలం వద్ద వెహికల్స్ సెర్చ్ చేస్తున్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారి నుంచి తప్పించుకొని వైట్ ఇన్నోవా కారు వేగంగా ముందుకు ఉరికించి తప్పించుకుంది.విషయాన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు అన్ని ఎక్సైజ్, పోలీస్ స్టేషన్స్ కు ఫార్వడ్ చేసి అలెర్ట్ చేశారు.ఇల్లందులో వెహికిల్ తనిఖీ చేస్తున్న కానిస్టేబుల్స్ బాబు,యాకూబ్ పాష ఫాస్టుగా వస్తున్న వైట్ ఇన్నివా కార్ ను ఆపే ప్రయత్నం చేయగా బాబుకు డాష్ ఇస్తూ అగ్రెసివ్ గా ముందుకు ఉరికింది. పోలీసులు కారును వెంబడించగా ఇల్లందు బస్టాండ్ దగ్గర స్తంభానికి గుద్దుకుని వైట్ ఇన్నోవా వెహికిల్ ఆగింది.ఇన్నోవా వెహికిల్ తనిఖీ చేయగా దాంట్లో 70 గంజాయి ప్యాకెట్లు దొరికాయి ఒక్కో ప్యాకెట్ 5 కేజీల బరువు ఉన్నాయి.మొత్తంగా 350 కేజీల గంజాయిని ఇల్లందు పోలీసులు సినీ ఫక్కీలో చేస్ చేసి పట్టుకున్నారు.ఈ విషయమై ఇల్లందు డిఎస్పీ రమణ మూర్తి మాట్లాడుతూ స్మగ్లింగ్ వాహనం నడుపుతున్న వ్యక్తి పేరు సాగర్ అని,మిగతా వారు ఆనంద్,అమూల్, ఈ ముగ్గురు మహారాష్ట్రకు చెందిన వ్యక్తులు ఒరిస్సా నుంచి గంజాయిని మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు తెలిపారు.ఈ వ్యవహారం అంతా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా చాక చాక్యంతో పట్టుకున్నరన్నారు.స్వాధీనం చేసుకున్న గంజాయి 21 లక్షలు విలువ చేస్తుందని తెలిపారు.ఎక్సైజ్ సిఐ రాజశేఖర్ సహకారంతో ఇది సాధ్యం అయిందని తెలిపారు. తదుపరి విచారణ ఇల్లందు సిఐ రాజు అధ్వర్యంలో సాగుతుందని తెలియజేసారు.ఈ మొత్తం వ్యవహారంలో ఇల్లందుకు సంబందించిన ఎక్సైజ్ ,పోలీస్ రెండు శాఖల ఎస్ఐ లు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.
