మన్యం న్యూస్, భద్రాచలం ఫిబ్రవరి 03
భద్రాచలం నూతన ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన పరితోష్ పంకజ్ ఐపీఎస్ శుక్రవారం భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పోట్రూ గౌతమ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో భాగంగా భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి చాంబర్లో భద్రాచలం ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా పిఓ ని కలిసి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. అనంతరం ఐటీడీఏ ద్వారా గిరిజనులకు అందిస్తున్న వివిధ పథకాల గురించి ఏఎస్పీకి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వివరించి బాధ్యతలు తీసుకున్నందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
