UPDATES  

 ఆధార్ స్వచ్చంద సంస్థ, కోయ క్యూసిన్ ఆద్వర్యంలో పుడ్ స్టాల్, ఎగ్జిబిషన్.

మన్యం న్యూస్ కరకగూడెం, ఫిబ్రవరి 03… మండల పరిధిలోని చిరుమళ్ళ గ్రామంలో జరిగిన శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతరలో ఆదివాసీ సంప్రదాయలు,సంస్కృతిని కాపడటంకోసం ఆధార్ స్వచ్చంద సంస్థ, కోయ క్యూసిన్ ఆద్వర్యంలో పుడ్ స్టాల్, ఎగ్జిబిషన్ ను శుక్రవారం ఆధార్ సచ్చన సంస్థ వ్యవస్థాపకులు తోలెం.రమేష్, కోయ క్యూసిన్ సభ్యులు పాయం.రాజేందర్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఆదివాసి గిరిజనులు ఎటువంటి ఆహారం తీసుకునేవారు వాటిని తయారు చేసి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలో ఫుడ్ స్టాల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.గతంలో ఆదివాసీ తిసుకనే ఆహారం నేటి సమాజానికి తెలపడానికి పలురకాల వంటలు కుడుములు,గటక,జావ,అంభలి,జొన్నరోట్టె,పజ్జోన్న రోట్టె అడవిలో దొరికే గడ్డలు,మొదలుగునవి పుడ్ స్టాలలో ఉంచడం జరిగినదని తెలిపారు.నేటి సమాజంలోని యవత ప్రాచీన ఆహారంపై శ్రద్ధచూపి వాటిని మరల తీసుకునే విధంగా నేటి ప్రజలు శ్రద్ధ చూపాలని తెలిపారు.ఈ స్టాలను జాతరకు వచ్చిన భక్తులందరూ విశిక్షించి స్వీకరించారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆధార్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు బట్ట బిక్షపతి ఊకె. గణేష్ తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !