UPDATES  

 పిట్టతోగు వంతెన పనులు ప్రారంభం ఫలించిన ప్రభుత్వ విప్ రేగా కృషి

మన్యం న్యూస్ గుండాల ఫిబ్రవరి 03: పిట్టతోగు వంతెన పనులు శుక్రవారం  దామరతోగు సర్పంచ్ సుతారి సరోజిని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. గుండాల ,వీరాపురం మార్గమధ్యలో పిట్టతోగు వాగు ప్రవహిస్తూ ఉంటుంది వర్షాకాలం ఈ వాగు వల్ల ప్రయాణికులకు నానా ఇబ్బందులు గురవుతూ ఉండేవి గుండాల, వీరాపురం రహదారి కి నిధులు మంజూరై కొంతమేర పనులు జరిగినప్పటికీ అటవీశాఖ అనుమతి లేక పూర్తిస్థాయిలో రోడ్డు పనులు పూర్తి కాలేదు ఎట్టకేలకు ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కృషితో అనుమతులు రావడంతో పనులను ఆర్ అండ్ బి అధికారులు ప్రారంభించారు. ఈ పనులు పూర్తయి రహదారి కూడా పూర్తయిందంటే గుండాల నుంచి మణుగూరు, తాడ్వాయి వెళ్లే ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు సుతారి సత్యం, కాంట్రాక్టర్ జలపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !