మన్యం న్యూస్ దుమ్ముగూడెం, ఫిబ్రవరి 03…
మండలంలోని సీతానగరం గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో శ్యామల వెంకటి అనే నిరుపేద ఇల్లు కాలిపోగా ఆ కుటుంబాన్ని పరామర్శించి బియ్యం వంట సామాగ్రి నగదు నిత్యవసర వస్తువులను మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణమూర్తి జడ్పిటిసి సీతమ్మ ఎంపీపీ రేసు లక్ష్మి చేతులమీదుగా శుక్రవారం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదంలో ఇల్లు కాలిపోయిన కుటుంబాన్ని బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ప్రభుత్వం ద్వారా వారికి రావలసిన అన్ని సౌకర్యాలు అందే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కనితి రాముడు, అధికార ప్రతినిధి ఎండి జానీ పాషా, ఉపాధ్యక్షుడు తునికి కామేశ్వరరావు, ఎంపిటిసిలు భీమరాజు, తిరుపతిరావు, నాయకులు శ్రీను, కిరణ్, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.