UPDATES  

 వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్ సౌకర్యం అందించాలి… – ఏ సి డి ల అదనపు భారం ప్రజలపై మోపవద్దు. -సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య.

మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి03: వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్ సౌకర్యం అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య కోరారు. ఆయన శుక్రవారం స్థానిక సీపీఎం కార్యాలయం లో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఏ సిడి ల పేరుతో ప్రజలపై అదనపు భారం మోపద్దన్నారు. పేదలపై, సామాన్యులపై రాష్ట్ర ప్రభుత్వం దొంగ చాటుగా విద్యుత్ భారాలను మోపడం సరైందికాదన్నారు. నెలవారి బిల్లులలో ఏ సి డి చార్జీల పేరుతో వసూలు చేయడం దారుణమన్నారు. బిల్లులు కట్టని వారి మొండిబకాయల వారి ఆస్తులు జప్తు చేసుకోవాలే తప్ప బిల్లులు కడుతున్న వారిపై ఇలా అమలు జరపడం దారుణమన్నారు. ప్రజలు బిల్లులు కడుతూనే ఉన్నారని, అసలు కట్టని వారిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ఇందుకు అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సిబ్బందిని భర్తీ చేయాలని, ఉన్న సిబ్బందితో వెట్టీ చాకిరి చేస్తున్నారని ,ఖాళీగా ఉన్న పోస్టులకు భర్తీ చేయడం ద్వారా రెగ్యులర్ పోస్టులు ఇవ్వడం ద్వారా ఈ నష్టం జరగకుండా చూసుకోవచ్చన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏజే రమేష్, జిల్లా కమిటీ సభ్యులు గద్దల శ్రీనివాసరావు, మండల కార్యదర్శి కొడిశాల రాములు, సీనియర్ నాయకులు నెల్లూరీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !