UPDATES  

 ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా.. ఎమ్మెల్యే ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్.

.
మన్యం న్యూస్, జూలూరుపాడు, ఫిబ్రవరి 03, ప్రజల సౌకర్యార్థం ఎమ్మెల్యే ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మండల కేంద్రంలో బస్ షెల్టర్, పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాలని గత రెండు సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వంగానీ, ప్రజా ప్రతినిధులు కాని, ప్రభుత్వ అధికారులు కానీ పట్టించుకోవడం లేదని అన్నారు, మండల కేంద్రంలో ప్రజల కోసం కనీస సదుపాయాలు బస్ షెల్టర్ లేక ప్రయాణికులు, అదే విధంగా వివిధ ప్రాంతాల నుంచి మండల కేంద్రానికి పనుల పై వచ్చి పోయే మహిళలకు పబ్లిక్ టాయిలెట్స్ లేక నాన ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, ఈ విషయం పై ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో గత రెండేళ్లుగా అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన సందర్భంలో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ బస్ షెల్టర్, పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణాలు చేపడతామని హామీ ఇచ్చి, నేటికీ ఇచ్చిన హామీని నెరవేర్చలేదన్నారు.. వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నాగుల్ మీరా, మండల అధ్యక్షులు అఖిల్, కార్యదర్శి చాంద్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !