పోలీస్ స్టేషన్ ను సందర్శించిన డీఎస్పీ అబ్దుల్ రెహమాన్..
జర్నలిస్టులను మిత్రులుగానే భావిస్తాం..
ఇరువురి లక్ష్యం సమాజ శ్రేయస్సు కోసమే.. డి.ఎస్.పి అబ్దుల్ రహమాన్..
మన్యం న్యూస్: జూలూరుపాడు, ఫిబ్రవరి 04, ఇటీవలనే కొత్తగూడెం డిఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అబ్దుల్ రెహమాన్ పోలీస్ స్టేషన్ సందర్శన లో భాగంగా శనివారం జూలూరుపాడు పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. స్టేషన్ లో గల పలు రకాల కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. స్టేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఎస్సై పోటు గణేష్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జర్నలిస్టులను మా మిత్రులగానే భావిస్తామని, ఇరువురి లక్ష్యం సమాజ శ్రేయస్సు కోసమేనని వెల్లడించారు. నేటి సమాజంలో జరుగుతున్న నేరాలు, దొంగతనాలు, బాల్య వివాహాలు, మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు, రోడ్డు ప్రమాదాలు, ఆర్థిక మోసాలను అరికట్టడానికి ఇరువురం కలిసి పనిచేసి, ప్రశాంత వాతావరణన్ని కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రజా సమస్యలను వీలైనంతవరకు పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై పోటు గణేష్, ఏఎస్ఐ మధులత, రైటర్ సూర్యం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.