UPDATES  

 ప్రకృతి ఆశ్రమంలో ‘ క్యాన్సర్ డే’

మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04….కృషి, పట్టుదల, ఆత్మస్థైర్యంతో సరి అయిన డైట్ తీసుకుంటూ, వైద్యుల సలహాలను పాటిస్తూ, క్యాన్సర్ ను జయించడం తేలికేనని పలువురు అభిప్రాయపడ్డారు. శనివారం అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని, స్థానిక ప్రకృతి ఆశ్రమంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. జీవన విధానాలలోని లోపాల వలన, కాలుష్యంతో నిండిన ఆహారాల వలన, ప్రపంచంలో క్యాన్సర్ వ్యాధి విచ్చలవిడిగా విజృంభిస్తుందని వారు అన్నారు. వివిధ వైద్య విధానాలను, పద్ధతులను అవలంబిస్తూ, డాక్టర్ల సలహాలను పాటిస్తూ, ప్రాపర్ డైట్ మైంటైన్ చేస్తూ, మంచి ఆలోచనలతో క్యాన్సర్ని జయించవచ్చు అన్నారు. ఈ సందర్భంగా ఎనిమిది సంవత్సరాలుగా మోటార్ సైకిల్ కు గ్లోబును, మొక్కను అమర్చుకొని, మొక్కల ప్రాధాన్యతను, పర్యావరణ సమతుల్యతను ప్రచారం చేస్తున్న, సింగరేణియన్ మొక్కల రాజశేఖర్ ను, గత పది సంవత్సరాల క్రితం క్యాన్సర్ తో పోరాడి, ప్రకృతి వైద్యం ద్వారా, దానిపై విజయం సాధించడమే కాకుండా, ప్రస్తుతం క్యాన్సర్ సోకిన వందల మందికి ఉచిత వైద్య సహాయాన్ని అందిస్తున్న సుగుణారావును ప్రత్యేకంగా అభినందించారు . అంతేకాకుండా ఇటీవల నూతనంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ (ఎల్టా)జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన, ఉపాధ్యాయుడు షేక్ దస్తగిరి లను ఈ సందర్భంగా వారు మొక్కలు అందజేసి, శాలువాలతో ఘనంగా సత్కరించి, సన్మానించారు. గౌస్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో మోటార్ వెహికల్ గార్డెన్ బ్యానర్ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ప్రకృతి వైద్య ప్రచారకులు డాక్టర్. బి. కృష్ణయ్య, కొత్తగూడెం మున్సిపల్ అంబాసిడర్, పర్యావరణవేత్త మొక్కల వెంకటయ్య,
ప్రకృతి ప్రేమికులు, తెలంగాణ విభిన్న ప్రతిభావంతుల సంఘం అధ్యక్షులు గుండపునేని సతీష్, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు మహమ్మద్ గౌస్, శ్రీ రామచంద్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ వెంకట్, గణితి కోటేశ్వరరావు, రాజేష్, శంకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !