మన్యం న్యూస్ గుండాల ఫిబ్రవరి 04..మండలంలోని లంబాడాలకు ఏజెన్సీ ధ్రువపత్రాలు ఇవ్వద్దని ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు వగబోయిన చంద్రయ్య దొర అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో ఉన్న లంబాడాలకు ఎట్టి పరిస్థితుల్లో ఏజెన్సీ పత్రాలు ఇవ్వద్దని ఆయన డిమాండ్ చేశారు. వలస వచ్చిన వారిని ఏ విధంగా స్థానికత కల్పిస్తారని ఆయన ప్రశ్నించారు పూర్తి బాధ్యత వహించి ధూపత్రాలు మంజూరు కాకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రమణబాబు, నాయకులు రాజేష్ , రమేష్ ఇతరులు పాల్గొన్నారు
