UPDATES  

 ఓసి 2 రక్షణ విభాగం ఉద్యోగుల సామాజిక సేవలు స్ఫూర్తిదాయకం…. -పీకే ఓసి రక్షణ అధికారి లింగబాబు.

మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి 04: సింగరేణి సంస్థ మణుగూరు ఏరియా పీకే ఓసి రక్షణ విభాగం ఉద్యోగుల సామాజిక సేవలు స్ఫూర్తిదాయకం అని పీకే ఓసి రక్షణ అధికారి లింగబాబు అన్నారు. శనివారం సంతోష్ నగర్ లోని బాల వెలుగు పాఠశాలకు ఓసి 2 సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉద్యోగుల ఆధ్వర్యంలో బియ్యాన్ని వితరణగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సింగరేణి ఉత్పత్తి ఉత్పాదకతలలో రక్షణ విభాగం అత్యంత కీలకమైందన్నారు. అనుక్షణం అప్రమత్తత చేయడమే గాక అందుకు తగ్గట్టుగా పని పరిస్థితులు కల్పించడంలో ప్రమాదాల నివారణలో రక్షణ విభాగం కీలకపాత్ర పోషిస్తుందని, ఉద్యోగపర్వంలో అంకితభావంతో పాటు తోటి వారిని ఆదుకోవాలనే ఒక మంచి సంకల్పాన్ని కలిగి ఉండటం కూడా ఇతరులకు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో నా సర్ పాషా, వరుణ్, పర్వేజ్, కార్తీక్, ఉపేందర్, బిక్షపతి, శేషగిరి,నరసయ్య,అరుణాచారి, lలింగమూర్తి, కృష్ణ, శ్రావణ్ కుమార్,విమల్ కుమార్,రాంబాబు, శివకుమార్, సతీష్ కుమార్, శ్రీనివాస్, జగన్మోహన్ రెడ్డి, ఉపాధ్యాయులు దుర్గాబాయి, రాధా తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !