మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04.. జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన లో భాగంగా శనివారం లక్ష్మీదేవి పల్లి మండలం గట్టు మల్ల గ్రామపంచాయతీ గంగమ్మ కాలనీలోని ఉన్న మినీ అంగన్వాడి కేంద్రం నందు జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (స్పర్స్ లేప్రసి అవగాహన ఉద్యమం) పై రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారి ఆధ్వర్యంలో గంగమ్మ కాలనీలో గిరిజన మహిళలకు గర్భిణీ బాలింతలకు బాలబాలికలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి వారితో కుష్టు వ్యాధి గురించి వివరించి ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపర్వైజర్ వెంకట నరసమ్మ మాట్లాడుతూ నా కుటుంబంలో లేదా పొరుగు వారిలో లేదా ఈ సమాజంలో ఎవరికైనా చర్మంపై స్పర్శ కోల్పోయిన మచ్చలు ఉండి వాటిని తాకినప్పుడు లేదా దాని మీద నొప్పి కలిగించినప్పుడు తెలియకపోతే వారిని సమీప ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ను సంప్రదించి వ్యాధి నిర్ధారణ చేసుకొని తగిన చికిత్స తీసుకోవాలన్నారు. కుష్టు వ్యాధిగ్రస్తులను కుష్టు వ్యాధి కారణంగా అంగవైకల్యం ఏర్పడిన వారి పట్ల శ్రద్ధ వహించాలని వారిని సమీపంలోనే ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తి చికిత్స తీసుకునేలా ప్రతి ఒక్కరూ సహకారం అందించాలన్నారు కార్యక్రమంలో ఏఎన్ఎం పార్వతి, పద్మ, అంగన్వాడి టీచర్ జ్యోతి, ఆశ వర్కర్ రాజేశ్వరి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
