UPDATES  

 ఈవీఎం ఎన్నికల గోదాం వద్ద పటిష్ట నిఘా పర్యవేక్షణ కొనసాగించండి…. జిల్లా కలెక్టర్ అనుదీప్

మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04….
ఈవీఎం ఎన్నికల గోదాం వద్ద పటిష్ట పర్యవేక్షణ నిఘా కొనసాగించాలని జిల్లా కలెక్టర్ అండ్ జిల్లా ఎన్నికల అధికారి అనుదీప్ తెలిపారు. శనివారం పాత కలెక్టరేట్ ప్రాంగణంలోని వివి పాట్, ఈవియం గోడౌన్ ను తనిఖీ చేశారు. తనిఖీలో
గోదాం కు వేసిన తాళం సీలును పరిశీలించారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. అనంతరం గోదాం తనిఖీ రిజిస్టర్ లో సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒక సారి ఈవియం గోదాంలో రక్షణ ఏర్పాట్లను తనిఖీ చేసి నివేదిక పంపనున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్ఓ అశోక్ చక్రవర్తి, ఏఓ గన్యా ఎన్నికల సిబ్బంది నవీన్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !