UPDATES  

 ఏసీడి చార్జెస్ రద్దు చేయాలని కాంగ్రెస్ అధ్వర్యంలో ధర్నా

 

మన్యం న్యూస్ ఇల్లందు ఫిబ్రవరి04: ఇల్లందు సుభాష్ నగర్ లోని సబ్ స్టేషన్ వద్ద శనివారం ఏసీడి  రూపంలో వసూలు చేస్తున్న అదనపు కరెంట్ చార్జెస్ రద్దు చేయాలని  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు  శనివారం ధర్నాకు దిగారు.ఈ సందర్భంలో పార్టీ ముఖ్య నాయకులు చీమల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అధికారంలోకి రావటానికి ఉచిత కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చి నేడు అధిక కరెంట్ చార్జెస్ వసూలు చేస్తున్నారని ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.వ్యవసాయానికి సక్రమంగా కరెంట్ ఇవ్వకపోవడం వల్ల రబీలో వేసిన పంటలు ఎండిపోతున్నాయన్నారు. పేదప్రజలను దోచుకు తింటున్న ఈ దొరల గడీల పాలన ఎక్కువకాలం నిలవదన్నారు. అనంతరం విద్యుత్ ఏడికి వినతిపత్రం అందజేశారు
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పులి సైదులు, ఎట్టి హరికృష్ణ, వల్లాల రాజయ్య, దన్ సింగ్ నాయక్,  గడదాసు వెంకటేశ్వర్లు, భుక్యావీరన్న,ముక్తి రాజు,అలెం ప్రసాద్,కాయం రమేష్ ,గొగ్గెల పాపారావు,అబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !