UPDATES  

 ఆమాత్యా…. మైలారం రాగి గనుల పరిశ్రమ పునః ప్రారంభం ఏది

ఆమాత్యా….
మైలారం రాగి గనుల పరిశ్రమ పునః ప్రారంభం ఏది
ఉపాధి కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ గిరిజన బిడ్డలు
అర్ధాంతరంగా మూసివేసిన గిరిజనులకు ఉపాధి చూపిన పరిశ్రమ
పొట్టకూటి కోసం వలస కూలీలుగా మారుతున్న నిరుద్యోగ గిరిజన యువత
కాపర్ మైన్ పై కాస్త కనికరించండి
నేతలు మా తలరాతలు మారుస్తారా…?
మైలారం రాగి గనుల పరిశ్రమపై మన్యం న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం
మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04…. అదొక దట్టమైన అడవి ప్రాంతం.. ఆ ప్రాంతం కొన్నేళ్ల క్రితం నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా పేరుగాంచింది.. ఎటు చూసినా ఎత్తైన కొండలు భారీ వృక్షాలతో కప్పబడి కొత్తగూడెం నియోజకవర్గం నుంచి సుమారు 20 కిలోమీటర్ల పరిధిలో అన్ని ఏజెన్సీ గ్రామాలతో ఏర్పడిన అటవీ ప్రాంతం.. ఆ ప్రాంతంలో నివసించి గిరిజనులకు గిరిజనేతలకు ఆనాడు ప్రభుత్వం ఉపాధి మార్గాలు చూపెట్టేందుకు అనేక కుటీర పరిశ్రమలు స్థాపించి చేయూతనిచ్చింది. ఆ క్రమంలోనే 1969 సంవత్సరంలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హయాంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం మైలారం గ్రామపంచాయతీ పరిధిలో దట్టమైన గుట్టల మధ్య రాగి నిక్షేపాలు ఉన్నట్లు కనుక్కొని వాటిని వెలికి తీసే పనిలో ప్రభుత్వం రాగి గనుల పరిశ్రమను స్థాపించింది. అప్పట్లో సరైన రహదారి లేకపోవడం చుట్టూరా ఎత్తైన కొండలు దట్టమైన అడవి ప్రాంతం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి ఆ పరిశ్రమలోకి వచ్చి పని చేసేందుకు సాహసించలేదు. దీంతో ప్రభుత్వం కొత్తగూడెం నియోజకవర్గం లోని రేగళ్ల, గట్టు మల్ల, మైలారం బంగారుచెలక ప్రాంతాల్లో ఉన్న గిరిజనులను ఆ పరిశ్రమలో రాగి నిక్షేపాలను తీసేందుకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చింది. అప్పట్లో సాంకేతిక పరిజ్ఞానం పూర్తిస్థాయిలో అందని ఆ రోజుల్లో ఆ ప్రాంత గిరిజనుల చేత పరిశ్రమలో వివిధ రకాల పనులు చేపిస్తూ రాగి నిక్షేపాల తవ్వకాలను ప్రారంభించారు. ఆ ప్రాంతం నుంచి రాగి గనులను ఇతర ప్రాంతాలకు ప్రభుత్వం తరలించేది. అయితే చదువుకున్న గిరిజన యువతతో పాటు ఆ ప్రాంతంలో నిరక్షరాస్యత గిరిజనులకు ఉపాధి మార్గాన్ని చూపెట్టారు. గత కొన్నేళ్లు పాటు సాఫీగా సాగిన ఈ రాగి కన్నుల పరిశ్రమ సాంకేతిక లోపాలకు మరి ఇతర కారణాల చేతో తెలియదు గాని ఉన్నట్లుండి అర్ధాంతరంగా ఈ పరిశ్రమ మూతపడింది. గతంలో ఈ పరిశ్రమ మీద ఆధారపడిన అనేక గిరిజన కుటుంబాలు ఉపాధి కోసం ఊర్లను వదిలి వలస కూలీలగా వెళ్లాల్సి వచ్చింది. పరిశ్రమలో పనిచేసిన కాలంలో తక్కువ వేతనం అయినప్పటికీ ఊరు మధ్య ఉండి ప్రతి ఒక్కరికి ఉపాధి మార్గాలు చూపెడుతుందని చదువుకున్న యువత కూడా ఆ రోజుల్లో చాలీచాలని వేతనాలను పొంది ఎంతో కష్టపడి పని చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు మూతబడిన మైలారం రాగి గనుల పరిశ్రమ తిరిగి ప్రారంభించాలని అనేక మార్లు గిరిజన కుటుంబాలు దశల వారి ఆందోళన సైతం చేపట్టాయి. అయినప్పటికీ ప్రభుత్వం ముందు రాకపోవడంతో రాగి నిక్షేపాలతో ఉన్న ఈ పరిశ్రమ నిరువుపయోగంగా పడి ఉంది.

స్వరాష్ట్రలో ఉపాధి దొరుకుతుందని ఆశపడ్డ గిరిజనులు
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తరుణంలో స్వరాష్ట్రలో ఉపాధి మార్గాలు ప్రభుత్వం చూపెడుతుందని చదువుకున్న యువతకు అర్హతను బట్టి ఉపాధి దొరుకుతుందని ఆ ప్రాంత గిరిజనులు ఆశపడ్డారు. రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఏజెన్సీ గ్రామాల అభివృద్ధిలో భాగంగా గత అడవి ప్రాంతమైన ప్రదేశాలలో ప్రజల సౌకర్యార్థం ఎంతో విశాలమైన రోడ్ల మార్గాలు ఏర్పడ్డాయి. నాడు అడవి ప్రాంతలే నేడు అభివృద్ధి బాటలో నడుస్తున్నాయి. సాధించుకున్న తెలంగాణలో మూతపడ్డ పరిశ్రమలు పున ప్రారంభించి ఆ ప్రాంత గిరిజనులకు గిరిజన నేతలకు ఉపాధి మార్గాలు చూపుతామన్న ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరబోతున్నాయని గతంలో ఆ ప్రాంత ప్రజలు ఆశతో ఎదురు చూశారు. కొంతకాలం తర్వాత రాగి గనుల పరిశ్రమను తిరిగి ప్రారంభించేందుకు సంబంధించిన జియాలజిస్టులు పరిశీలించి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. గతంలో కొత్తగూడెం నియోజకవర్గంలోని అనిశెట్టిపల్లి కూనారం ప్రాంత సరిహద్దులతో పాటు ఉమ్మడి బంగారు చిలక పంచాయతీలోని పునుగుడు చిలక ప్రాంతంలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసేందుకు అప్పట్లో అనేక సర్వేలు చేపట్టిన ప్రభుత్వం ఆ తరుణంలోనే మైలారంలో మూతపడ్డ రాగి పరిశ్రమ పైన కూడా దృష్టి సారించారు. అయినప్పటికీ అటు విమానాశ్రయం కానీ ఇటు మూతపడ్డ రాగి పరిశ్రమ గాని ఇంతవరకు నెరవేరలేదని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి.

మూతపడ్డ పరిశ్రమలు తెరిపించండి ఉపాధి మార్గం చూపండి…. గుగలోత్ రూప్లా.. రేగళ్ల
గత కొన్ని సంవత్సరాల క్రితం మూతపడ్డ మైలారం రాగన్న పరిశ్రమ ప్రభుత్వం పునః ప్రారంభం ఇస్తే గిరిజన ప్రాంతంలో చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాన్ని చూపెట్టిన వారు అవుతారు. తెలంగాణ బిడ్డల ఉద్యోగ ఉపాధి మార్గాలను దృష్టి పెట్టుకొని ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నించాలి

పనులు లేక వలస వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది
దీటి లక్ష్మీపతి గ్రామస్తుడు
మైలారం రాగి గనుల పరిశ్రమంలో మా తాత ముత్తాతల దగ్గర నుంచి పనులు చేస్తూ కుటుంబాలను పోషించారు. మాకు కూడా పరిశ్రమలో ఉపాధి దొరుకుతుంది ఆశపడ్డాం కానీ ఆ ఆశలు నేటికీ నెరవేరలేదు. ప్రభుత్వమే దయచేసి ముందుకు రావాలి

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !