పంజాబీ న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 06…తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లా వైద్యాధికారులు సోమవారం ఓఎస్డీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది.ఓఎస్డి టి.సాయి మనోహర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ డా.వినీత్. హాజరయ్యి కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీస్ శాఖలో పనిచేసే అధికారులు,సిబ్బంది ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ద్వారా కుటుంబ సభ్యులతో కలిసి కంటి పరీక్షలు చేయించుకుని, ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఉచితంగా అందజేసే కళ్ళజోళ్లను పొందాలని తెలియజేసారు.ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో మొదటిరోజు సుమారుగా 100 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయి మనోహర్,జిల్లా వైద్యారోగ్య ఆధికారిణి శిరీష, ప్రోగ్రామ్ ఆఫీసర్ పర్షియా నాయక్,ఆర్ఐ ప్రసాద్ ఇతర సిబ్బంది అధికారులు పాల్గోన్నారు.
